కొత్త మోడల్ మ్యాక్ బుక్ను పరిచయం చేయనున్న ఆపిల్...
By: chandrasekar Wed, 11 Nov 2020 9:29 PM
ప్రముఖ టెక్ దిగ్గజం
ఆపిల్ కొత్త మోడల్ మ్యాక్ బుక్ను మార్కెట్ లోకి ప్రవేశ పెట్టనున్నది. ఆ కొత్త
ప్రొడక్ట్స్ వివరాలను ఆపిల్ ప్రకటించింది. మొబైల్స్తోపాటు కంప్యూటర్ల ప్రపంచంలోనూ
తనదైన ప్రత్యేక ముద్ర వేసింది. అయితే ఈసారి ఆపిల్ తన కొత్త మోడల్ మ్యాక్ బుక్ను
పరిచయం చేసేందుకు సిద్ధమైంది.
ఆయా మోడల్స్, ధర ఎంత
అనే వివరాలు తెలిపింది. అయితే ఈ సారి సరికొత్త హార్డ్వేర్తో మూడు మోడల్స్ను
మార్కెట్లోకి తీసుకురానుంది. అవి మ్యాక్ బుక్ ఎయిర్, మ్యాక్
బుక్ ప్రో, మ్యాక్ మినీలుగా ప్రకటించారు. అయితే వీటిలో ఈ సంస్థ
తన కొత్త సిలికాన్ ఎం1 చిప్ను వాడనున్నట్లు సమాచారం.
మ్యాక్ బుక్ ఎయిర్ 13
అంగుళాల తెరతో టచ్ ఐడీ సౌకర్యంతో దానికి తోడుగా ఎక్కువ బ్యాటరీ లైఫ్తో రానుంది.
దీని ధర 999 యూఎస్
డాలర్లుగా తెలిపారు. ఇక మ్యాక్ బుక్ ప్రో విషయానికొస్తే ఇదికూడా 13
అంగుళాల తెర, 8కే రిసొల్యూషన్, యాక్టివ్ కూలింగ్,
20 గంటల పాటు వీడియో ప్లేబ్యాక్తో 1,299
డాలర్లకు మార్కెట్లో అడుగు పెట్టనుంది. మ్యాక్ మిని చూస్తే ఇందులో ఎం1 చిప్తో
పాటు కొత్త రకం సీపీయూను వాడినట్లు పేర్కొన్నారు.
ఇప్పటి వరకూ వచ్చిన
వాటికన్నా గ్రాఫిక్స్ ఆరు రెట్లు ఫాస్ట్ గా ఉంటుంది. చక్కటి గేమ్ప్లే అనుభూతిని
కలిగిస్తుంది. అయితే ఈ మ్యాక్ మినీ గత మోడల్ కన్నా తక్కువ ధరలో 699
డాలర్లకు లభిస్తుంది. అయితే ఈ మూడు మోడల్లు ప్రీ బుకింగ్ అవేలబిలీటీలో ఉన్నాయని, వచ్చే
వారం మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు తెలిపారు.