Advertisement

  • ఏపీలో కరోనా కల్లోలం ..ఆరు లక్షలు దాటిన మొత్తం పాజిటివ్ కేసులు

ఏపీలో కరోనా కల్లోలం ..ఆరు లక్షలు దాటిన మొత్తం పాజిటివ్ కేసులు

By: Sankar Thu, 17 Sept 2020 8:17 PM

ఏపీలో కరోనా కల్లోలం ..ఆరు లక్షలు దాటిన మొత్తం పాజిటివ్ కేసులు

ఆంధ్రప్రదేశ్ లో కరోనా ఉదృతి కొనసాగుతోంది. ఏపీలో ప్రతిరోజూ భారీ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశాఖ కరోనా బులిటెన్ ను రిలీజ్ చేసింది.

ఈ బులెటిన్ ప్రకారం ఏపీలో కొత్తగా 8702 కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 6,01,462కి చేరింది. ఇందులో 88,197 కేసులు యాక్టివ్ గా ఉంటె, 5,08,088 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో 72 మంది కరోనాతో మరణించారు. దీంతో ఏపీలో నమోదైన మొత్తం మరణాల సంఖ్య 5177 కి చేరింది. ఇక ఇదిలా ఉంటె, ఏపీలో ఒక్కరోజులో జిల్లాల్లో నమోదైన కేసులు ఇలా ఉన్నాయి.

అనంతపూర్ లో 545, చిత్తూరులో 905, తూర్పు గోదావరిలో 1383, గుంటూరులో 550, కడపలో 637, కృష్ణా జిల్లాలో 367, కర్నూలులో 394, నెల్లూరులో 610, ప్రకాశం జిల్లాలో 705, శ్రీకాకుళంలో 567, విశాఖపట్నంలో 449, విజయనగరంలో 526, పశ్చిమ గోదావరిలో 1064 కేసులు నమోదయ్యాయి.

Tags :
|
|

Advertisement