Advertisement

  • ఏపీలో రోజు రోజుకు కొత్త రికార్డులు సృష్టిస్తున్న కరోనా ..ఎనిమిదివేలకు చేరిన ఒక్క రోజు పాజిటివ్ కేసులు ..

ఏపీలో రోజు రోజుకు కొత్త రికార్డులు సృష్టిస్తున్న కరోనా ..ఎనిమిదివేలకు చేరిన ఒక్క రోజు పాజిటివ్ కేసులు ..

By: Sankar Fri, 24 July 2020 07:14 AM

ఏపీలో రోజు రోజుకు కొత్త రికార్డులు సృష్టిస్తున్న కరోనా ..ఎనిమిదివేలకు చేరిన ఒక్క రోజు పాజిటివ్ కేసులు ..



ఆంధ్ర ప్రదేశ్లో కరోనా కేసులు రోజు రోజుకు సరికొత్త రికార్డులను నమోదు చేస్తున్నాయి ...అసలు మొన్నటిదాకా ఏపీలో కరోనా నిద్రావస్థలో ఉందా అన్నంత స్థాయిలో ఇప్పుడు కరోనా కేసులు నమోదు అవుతున్నాయి ..తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 7,998 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 72,711కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కరోనాపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది.

గడిచిన 24 గంటల్లో 58,052 శాంపిల్స్‌ను పరీక్షించగా 7,998 మందికి కరోనా నిర్ధారణ అయినట్టు పేర్కొంది. తాజాగా కరోనా నుంచి కోలుకున్న 5,428 మంది డిశ్చార్జ్‌ కావడంతో.. ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 37,555కి చేరింది.ప్రస్తుతం రాష్ట్రంలో 34,272 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. కొత్తగా కరోనాతో 61 మంది మృతిచెందడంతో మొత్తం మరణాల సంఖ్య 884గా నమోదైంది. మరోవైపు రాష్ట్రంలో ఇప్పటివరకు రికార్డు స్థాయిలో 14,93,879 శాంపిల్స్‌ పరీక్షించారు..

ఇక జిల్లాల వారీగా చూసుకుంటే ఈస్ట్ గోదావరిలో అత్యధికంగా 1391 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి..ఆ తర్వాత గుంటూరు , అనంతపురంలలో వెయ్యికి పైగా కేసులు నమోదు అయ్యాయి ..ఇక కర్నూల్ జిల్లాలో తొమ్మిది వందలకు పైగా కేసులు నమోదు అయ్యాయి ..

Tags :
|
|
|

Advertisement