Advertisement

ఏపీలో తగ్గినా కరోనా కేసులు...తాజా కేసులు 7738

By: Sankar Sun, 20 Sept 2020 8:34 PM

ఏపీలో తగ్గినా కరోనా కేసులు...తాజా కేసులు 7738


ఆంధ్రప్రదేశ్ లో కరోనా ఉదృతి కొనసాగుతోంది. ఏపీలో ప్రతిరోజూ భారీ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశాఖ కరోనా బులిటెన్ ను రిలీజ్ చేసింది.

ఈ బులెటిన్ ప్రకారం ఏపీలో కొత్తగా 7,738 కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 625514కు చేరింది. ఇందులో 78836 కేసులు యాక్టివ్ గా ఉంటె, 541319 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో 57 మంది కరోనాతో మరణించారు. దీంతో ఏపీలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 5359కు చేరింది.

ఇక ఇదిలా ఉంటె, ఏపీలో ఒక్కరోజులో జిల్లాల్లో నమోదైన కేసులు ఇలా ఉన్నాయి. అనంతపూర్ లో 539, చిత్తూరులో 794, తూర్పు గోదావరిలో 1260, గుంటూరులో 582, కడపలో 267, కృష్ణా జిల్లాలో 439, కర్నూలులో 275, నెల్లూరులో 444, ప్రకాశం జిల్లాలో 869, శ్రీకాకుళంలో 476, విశాఖపట్నంలో 342, విజయనగరంలో 446, పశ్చిమ గోదావరిలో 1005 కేసులు నమోదయ్యాయి.

Tags :
|
|

Advertisement