ఏపీలో భారీగా తగ్గిన కరోనా పాజిటివ్ కేసులు
By: Sankar Mon, 10 Aug 2020 7:35 PM
ఆంధ్రప్రదేశ్లో గత 24 గంటల్లో 46,699 కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయగా 7,665 మందికి పాజిటివ్గా తేలింది. తాజా పరీక్షల్లో 22,668 ట్రూనాట్ పద్ధతిలో, 24,331 ర్యాపిడ్ టెస్టింగ్ పద్ధతిలో చేశారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,35,525 కు చేరింది.
కొత్తగా 6,924 మంది వైరస్ బాధితులు కోలుకుని సోమవారం డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కోలుకున్నవారి మొత్తం సంఖ్య 1,45,636 కి చేరింది. రాష్ట్రవ్యాప్తంగా 87,112 యాక్టివ్ కేసులున్నాయి. వైరస్ బాధితుల్లో తాజాగా 80 మంది మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 2116 కు చేరింది. ఈమేరకు ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్లో పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 25,34,304 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశామని తెలిపింది..
ఇక జిల్లాల వారీగా చూసుకుంటే ఈస్ట్ గోదావరిలో 1235, కర్నూలు లో 883, వెస్ట్ గోదావరిలో 722, అనంతపూర్ లో 631, గుంటూరు 621, విశాఖపట్నంలో 620, విజయనగరం 574, నెల్లూరు 511 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి