Advertisement

  • ఏపీలో మళ్ళీ పెరిగిన కరోనా కేసులు ..కానీ తగ్గుతున్న మరణాలు

ఏపీలో మళ్ళీ పెరిగిన కరోనా కేసులు ..కానీ తగ్గుతున్న మరణాలు

By: Sankar Tue, 22 Sept 2020 7:10 PM

ఏపీలో మళ్ళీ పెరిగిన కరోనా కేసులు ..కానీ తగ్గుతున్న మరణాలు


ఏపీలో కరోనా కేసులు మళ్ళీ పెరిగాయి .. మంగళవారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్‌లో గడిచిన 24 గంటల్లో 68,829 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 7,553 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కరోనా వైరస్ కేసులు 6,39,302కు చేరుకున్నాయి.

అలాగే రాష్ట్రంలో కరోనా వైరస్ మరణాలు కూడా తగ్గుముఖం పట్టాయి. మంగళవారం కరోనా బారినపడి 51 మంది మరణించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కరోనా మహమ్మారి వల్ల మృతి చెందిన వారి సంఖ్య 5,461కు చేరుకుంది. కరోనా మహమ్మారి బారిన పడి గడిచిన 24 గంటల్లో చిత్తూరు జిల్లాలో 8 మంది, అనంతపురంలో ఆరుగురు, విశాఖపట్నంలో ఆరుగురు, కృష్ణా ఐదుగురు, ప్రకాశంలో ఐదుగురు, తూర్పు గోదావరిలో నలుగురు, కర్నూలులో నలుగురు, గుంటూరులో ముగ్గురు, కడపలో ముగ్గురు, నెల్లూరులో ముగ్గురు, పశ్చిమ గోదావరిలో ముగ్గురు, శ్రీకాకుళంలో ఒకరు మృత్యువాత పడ్డారు.

ఇక సోమవారంతో పోలిస్తే మంగళవారం 10 వేలకు పైగా కరోనా టెస్టులు ఎక్కువ నిర్వహించడంతో కేసుల పెరిగినట్లు తెలుస్తోంది. ఇక తూర్పు గోదావరి జిల్లాలో మాత్రం కరోనా వైరస్ మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ఈ ఒక్క జిల్లాలోనే ప్రతి రోజూ వెయ్యికి పైగా కేసులు నమోదవుతున్నాయి..మంగళవారం 10,555 మంది కరోనా మహమ్మారిని పూర్తిగా జయించి డిశ్చార్జి అయ్యారని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా నమోదైన మొత్తం 6,39,302 పాజిటివ్ కేసులకు గాను, 5,62,376 మంది డిశ్చార్జి కాగా, ప్రస్తుతం 71,465 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు

Tags :
|
|

Advertisement