Advertisement

  • ఏపీలో వెయ్యిలోపు నమోదు అయిన కరోనా పాజిటివ్ కేసులు...

ఏపీలో వెయ్యిలోపు నమోదు అయిన కరోనా పాజిటివ్ కేసులు...

By: Sankar Mon, 16 Nov 2020 7:17 PM

ఏపీలో వెయ్యిలోపు నమోదు అయిన కరోనా పాజిటివ్ కేసులు...


ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు తగ్గు ముఖం పట్టాయి. ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా 753 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,54,764కి చేరింది.

ఇందులో 8,29991 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 17892 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక ఏపీలో కరోనాతో గడిచిన 24 గంటల్లో 13 మంది మృతి చెందారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన కరోనా మృతుల సంఖ్య 6,881కి చేరింది. ఏపీలో జిల్లాల వారీగా నమోదైన కరోనా కేసుల వివరాలు ఇలా ఉన్నాయి.

అనంతపూర్ లో 4, చిత్తూరులో 87, తూర్పు గోదావరిలో 130, గుంటూరులో 50, కడపలో 66, కృష్ణాలో 76, కర్నూలులో 12, నెల్లూరులో 14, ప్రకాశంలో 36, శ్రీకాకుళంలో 25, విశాఖపట్నంలో 25, విజయనగరంలో 12, పశ్చిమ గోదావరిలో 216 కేసులు నమోదయ్యాయి.

Tags :
|
|

Advertisement