Advertisement

ఏపీలో తగ్గుతున్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య

By: Sankar Sun, 29 Nov 2020 7:29 PM

ఏపీలో తగ్గుతున్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య


ఏపీలో కరోనా మహమ్మారి వైరస్‌ ఉధృతి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో ఆ రాష్ట్రంలో కొత్తగా 690 కొవిడ్‌-19 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

కాగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కరోనా వైరస్‌ నిర్థారణ పరీక్షలు చేయించింది ప్రభుత్వం. ఇప్పటి వరకు కోటి 17వేల 126 పరీక్షలు నిర్వహించిందివైరస్‌ బారినపడిన వారిలో ఇవాళ 3,787 మంది కోలుకొని డిశ్చార్జికాగా ఏడుగురు చనిపోయారు. ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య 8,67,683కు చేరింది.

ఇవాళ్టి వరకు 8,52,298 మంది కోలుకున్నారు. మరో 8397 మంది వివిధ దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. తీవ్ర ఇన్‌ఫెక్షన్ల కారణంగా 6988 మంది మృత్యువాతపడ్డారు. గడిచిన 24 గంటల్లో 54,710 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. ఇప్పటివరకు 1,00,17,126 శాంపిళ్లను పరీక్షించినట్లు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.

Tags :
|
|

Advertisement