Advertisement

గుడ్ న్యూస్ : ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు

By: Sankar Tue, 18 Aug 2020 07:16 AM

గుడ్ న్యూస్ : ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు


ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల విజృంభణ కాస్త తగ్గినట్లు కనిపిస్తోంది. గత మూడు రోజులుగా కరోనా పాజిటివ్ కేసులు భారీగా తగ్గుముఖం పట్టాయి. సోమవారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్‌లో కరోనా వైరస్ కేసులు ఆదివారంతో పోల్చుకుంటే భారీగా తగ్గాయి.

అయితే కరోనా వైరస్ పరీక్షలు తగ్గించగా, పాజిటివ్ కేసులు సైతం తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 44,578 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 6,780 మందికి పాజిటివ్ అని తేలింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య 2,96,609కు చేరింది.

గడచిన 24 గంటల్లో ఏకంగా 82 మంది కరోనా మహమ్మారి బారినపడి మృతి చెందారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కరోనా మరణాల సంఖ్య 2,732కు పెరిగింది. ఇక, కరోనా మహమ్మారి బారిన పడి గడిచిన 24 గంటల్లో ప్రకాశం జిల్లాలో 13 మంది, తూర్పు గోదావరిలో 10 మంది, చిత్తూరులో 8 మంది, గుంటూరులో ఏడుగురు, కడపలో ఏడుగురు, శ్రీకాకుళంలో ఆరుగురు, పశ్చిమ గోదావరిలో ఆరుగురు, అనంతపురంలో ఐదుగురు, కృష్ణాలో ముగ్గురు, నెల్లూరు ఇద్దరు మృత్యువాత పడ్డారు.


Tags :
|
|
|
|

Advertisement