ఏపీలో కొత్త కరోనా కేసులు ఎన్నో తెలుసా !
By: Sankar Sun, 06 Dec 2020 7:24 PM
గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్లో 60,329 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 667 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 87,1972కి చేరింది.
ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. గత 24 గంటల్లో కరోనా నుంచి క్షేమంగా కోలుకుని 914 మంది డిశ్చార్జ్ అవ్వగా, ఇప్పటివరకు 8,59,029 మంది డిశ్చార్జ్ అయ్యారు.
గడచిన 24 గంటల్లో కరోనా బారినపడి చిత్తూరులో ఇద్దరు, కృష్ణాలో ఇద్దరు, అనంతపురం, గుంటూరు, వైఎస్సార్ కడప, నెల్లూరు, విశాఖపట్నంలో ఒక్కొక్కరు చొప్పున మొత్తం 9 మంది మరణించగా, ఇప్పటి రాష్ట్రంలో 7,033 మంది మృతిచెందారు. ఏపీలో ప్రస్తుతం 5,910 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఏపీలో రికార్డు స్థాయిలో కరోనా పరీక్షలు జరుగుతున్నాయి. నేటి వరకు 1,04,10,612 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు