Advertisement

ఏపీలో కొత్తగా 40 కరోనా మరణాలు

By: Sankar Sun, 04 Oct 2020 7:42 PM

ఏపీలో కొత్తగా 40 కరోనా మరణాలు


ఆంధ్రప్రదేశ్ లో కరోనా ఉధృతి ఏ మాత్రం తగ్గడంలేదు. ఇప్పటికే రాష్ట్రంలో ఏడు లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 6,242 కరోనా కేసులు నమోదయ్యాయి.

దీంతో ఏపీలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 719256 కేసులు నమోదయ్యాయి. ఇందులో 54400 కేసులు యాక్టివ్ గా ఉంటె, 658875 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇక ఇదిలా ఉంటె గడిచిన 24 గంటలలో ఏపీలో కొత్తగా 40 కరోనా మరణాలు సంభవించాయి. దీంతో ఏపీలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 5981కి చేరింది.

ఇక ఏపీలోని జిల్లాల్లో నమోదైన కరోనా కేసులు ఇలా ఉన్నాయి. అనంతపూర్ లో 411, చిత్తూరులో 863, తూర్పు గోదావరి జిల్లాలో 826, గుంటూరులో 562, కడపలో 408, కృష్ణా జిల్లాలో 469, కర్నూలులో 220, నెల్లూరులో 413, ప్రకాశంలో 582, శ్రీకాకుళంలో 192, విశాఖపట్నంలో 222, విజయనగరంలో 221, పశ్చిమ గోదావరిలో 853 కేసులు నమోదయ్యాయి.

Tags :
|
|

Advertisement