Advertisement

ఏపీలో తగ్గుతున్న కరోనా కేసులు...

By: Sankar Tue, 29 Sept 2020 7:26 PM

ఏపీలో తగ్గుతున్న కరోనా కేసులు...


ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. తాజగా ఏపీ ఆరోగ్యశాఖ రిలీజ్ చేసిన కరోనా బులెటిన్ ప్రకారం గడిచిన 24 గంటల్లో ఏపీలో 6,190 కొత్త కేసులు నమోదయ్యాయి.

దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 687351కి చేరింది. ఇందులో 59435 కేసులు యాక్టివ్ గా ఉంటె, 622136 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనాతో 35 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం మరణాల సంఖ్య 5780కి చేరింది. ఇక ఇదిలా ఉంటె, జిల్లాల వారీగా నమోదైన కరోనా కేసుల వివరాలు ఇలా ఉన్నాయి.

అనంతపూర్ లో 276, చిత్తూరులో 784, తూర్పు గోదావరి జిల్లాలో 991, గుంటూరులో 410, కడపలో 299, కర్నూలులో 398, కృష్ణా జిల్లాలో 144, నెల్లూరులో 432, ప్రకాశంలో 569, శ్రీకాకుళంలో 377, విశాఖపట్నంలో 291, విజయనగరంలో 312, పశ్చిమ గోదావరిలో 907 కేసులు నమోదయ్యాయి.

Tags :
|
|

Advertisement