Advertisement

ఏపీలో నిలకడగా కరోనా పాజిటివ్ కేసులు...

By: Sankar Fri, 04 Dec 2020 8:41 PM

ఏపీలో నిలకడగా కరోనా పాజిటివ్ కేసులు...


ఏపీ లో కరోనా ఉధృతి ఏ మాత్రం తగ్గడం లేదు. ఇప్పటికే ఏపీలో 8.70 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. తాజా కరోనా బులెటిన్ ప్రకారం ఏపీలో కొత్తగా 599 కరోనా కేసులు నమోదయ్యాయి.

దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,70,675 కి చేరింది. ఇందులో 8,57,233 మంది ఇప్పటికే డిశ్చార్జ్ కాగా, 6,422కేసులు ఇంకా యాక్టివ్ గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనాతో 5 మంది మృతి చెందారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 7,020 కి చేరింది.

అలానే జిల్లా వారీగా చూస్తే అనంతపురంలో 24, చిత్తూరులో 92, తూర్పుగోదావరి జిల్లాలో 60, గుంటూరులో 71, కడపలో 25, కృష్ణాలో 115, కర్నూలులో 13, నెల్లూరులో 23, ప్రకాశంలో 20, శ్రీకాకుళంలో 41, విశాఖపట్నంలో 22, విజయనగరంలో 8, పశ్చిమ గోదావరిలో 85 కేసులు నమోదయ్యాయి.

Tags :
|
|

Advertisement