Advertisement

ఏపీలో మళ్ళీ కరోనా కేసుల పెరుగుదల ..

By: Sankar Tue, 06 Oct 2020 7:08 PM

ఏపీలో మళ్ళీ కరోనా కేసుల పెరుగుదల ..


ఆంధ్రప్రదేశ్ లో కరోనా ఉధృతి ఏ మాత్రం తగ్గడంలేదు. ఇప్పటికే రాష్ట్రంలో ఏడు లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 5,795 కరోనా కేసులు నమోదయ్యాయి.

దీంతో ఏపీలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 729307 కేసులు నమోదయ్యాయి. ఇందులో 50776 కేసులు యాక్టివ్ గా ఉంటె, 672479 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇక ఇదిలా ఉంటె గడిచిన 24 గంటలలో ఏపీలో కొత్తగా 33 కరోనా మరణాలు సంభవించాయి. దీంతో ఏపీలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 6052కి చేరింది.

ఇక ఏపీలోని జిల్లాల్లో నమోదైన కరోనా కేసులు ఇలా ఉన్నాయి. అనంతపూర్ లో 209, చిత్తూరులో 970, తూర్పు గోదావరిలో 801, గుంటూరులో 441, కడపలో 434, కృష్ణలో 482, కర్నూలులో 123, నెల్లూరులో 451, ప్రకాశంలో 580, శ్రీకాకుళంలో 142, విశాఖపట్నంలో 303, విజయనగరంలో 163, పశ్చిమ గోదావరి జిల్లాలో 696 కేసులు నమోదయ్యాయి.

Tags :
|
|

Advertisement