Advertisement

ఏపీలో కొత్తగా 538 కరోనా పాజిటివ్ కేసులు

By: Sankar Thu, 10 Dec 2020 6:58 PM

ఏపీలో కొత్తగా 538 కరోనా పాజిటివ్ కేసులు


ఏపీలో కరోనా కేసుల ఉధృతి తగ్గింది. గతంలో రోజుకు పదివేల వరకు నమోదు కాగా, ఇప్పుడు ఆ కేసుల సంఖ్య 500లకు పడిపోయింది. ఏపీ ఆరోగ్యశాఖ తాజాగా కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది.

ఈ బులెటిన్ ప్రకారం, గడిచిన 24 గంటల్లో ఏపీలో 538 కొత్త కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,73,995కి చేరింది. ఇందులో 8,61,711 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 5,237 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.

ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనాతో ఇద్దరు మృతి చెందారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు కరోనాతో 7047 మంది మృతి చెందారు. పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతున్నప్పటికీ కరోనా ఉధృతి పూర్తిగా తగ్గిపోలేదని, జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్యనిపుణులు హెచ్చరిస్తున్నారు

Tags :
|

Advertisement