Advertisement

ఏపీలో కొత్తగా ఎన్ని కరోనా కేసులో తెలుసా !

By: Sankar Thu, 17 Dec 2020 5:23 PM

ఏపీలో కొత్తగా ఎన్ని కరోనా కేసులో తెలుసా !


ఏపీలో కరోనా కేసులు గత కొంతకాలంగా నిలకడగా 500 కి దగ్గర్లో నమోదు అయితున్నాయి.. రాష్ట్రంలో గత 24 గంటల్లో 63,821 కరోనా పరీక్షలు నిర్వహించగా, 534 మందికి పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా వైరస్‌ బారినపడినవారి సంఖ్య 877348కి చేరింది. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది...

గడచిన 24 గంటల్లో 498 మంది కోవిడ్‌నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. ఇప్పటివరకు 865825 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. ఏపీలో ప్రస్తుతం 4454 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో రికార్డుస్థాయిలో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. నేటి వరకు 1,10,65,297 శాంపిల్స్‌ను పరీక్షించారు..

గత 24 గంటల్లో రాష్ట్రంలో కరోనా బారినపడి అనంతపురం, పశ్చిమగోదావరి లో ఒక్కొక్కరు చొప్పున ఇద్దరు మరణించారు. ఇప్పటివరకు కరోనాతో 7069 మంది మృతిచెందారు.

Tags :
|
|

Advertisement