ఏపీలో కొత్త కరోనా కేసులు ఎన్నో తెలుసా !
By: Sankar Fri, 11 Dec 2020 5:08 PM
ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో 64,425 కరోనా పరీక్షలు నిర్వహించగా, 520 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది.
ఇప్పటివరకు ఏపీలో కరోనా బారినపడివారి సంఖ్య 874515కి చేరుకుంది. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. గడచిన 24 గంటల్లో 519 మంది కరోనా నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్ అవ్వగా, ఇప్పటివరకు 8,62,230 మంది డిశ్చార్జ్ అయ్యారు..
ఇక జిల్లా వారీగా చూస్తే అనంతపురంలో 29, చిత్తూరులో 108, తూర్పుగోదావరి జిల్లాలో 59, గుంటూరులో 64, కడపలో 9, కృష్ణాలో 71, కర్నూలులో 20, నెల్లూరులో 13, ప్రకాశంలో 21, శ్రీకాకుళంలో 11, విశాఖపట్నంలో 34, విజయనగరంలో 12, పశ్చిమ గోదావరిలో 69 కేసులు నమోదయ్యాయి.
Tags :
ap |
reports |
520 |