Advertisement

ఏపీలో కొత్త కరోనా కేసులు ఎన్నో తెలుసా !

By: Sankar Wed, 16 Dec 2020 7:47 PM

ఏపీలో కొత్త కరోనా కేసులు ఎన్నో తెలుసా !


ఏపీలో ఇవాళ కొత్తగా 478 కొవిడ్‌-19 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వైరస్‌ బారినపడిన వారిలో 715 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.

ఏపీలో ఇప్పటివరకు పాజిటివ్‌ కేసుల సంఖ్య 8,76,814కు చేరింది. 8,65,327 మంది కోలుకున్నారు. మరో 4,420 మంది చికిత్స పొందుతున్నారు. వైరస్‌ ఇన్‌ఫెక్షన్‌ కారణంగా ఇవాళ్టివరకు 7,067 మంది చనిపోయారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో 64,099 మందికి కొవిడ్‌-19 వైరస్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.

ఇప్పటివరకు 1,10,01,476 శాంపిళ్లను పరీక్షించినట్లు ఆరోగ్యశాఖ అధికారులు పేర్కొన్నారు..కాగా ఏపీలో గత కొంతకాలంగా కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి ...ఒకానొక దశలో పదివేలకు చేరిన కరోనా పాజిటివ్ కేసులు ఇప్పుడు అయిదు వందలకు దగ్గర్లో నమోదు అయితున్నాయి...

Tags :
|
|

Advertisement