Advertisement

ఏపీలో మళ్ళీ పెరిగిన కరోనా కేసులు

By: Sankar Tue, 13 Oct 2020 6:48 PM

ఏపీలో మళ్ళీ పెరిగిన కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్ లో కరోనా ఉధృతి ఎంత మాత్రం తగ్గడం లేదు. ఇప్పటికే రాష్ట్రంలో 7.63 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. తాజాగా ఏపీ ఆరోగ్యశాఖ కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది.

ఈ బులెటిన్ ప్రకారం ఏపీలో గడిచిన 24 గంటల్లో 4622 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 763573కి చేరింది. ఇందులో 42,855 కేసులు యాక్టివ్ గా ఉంటే, 7,11,532 మంది ఇప్పటికే కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.

ఇక ఇదిలా ఉంటె, గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనాతో 35 మంది మృతి చెందారు. దీంతో ఏపీలో నమోదైన మొత్తం మరణాల సంఖ్య 6,291కి చేరింది. ఇక జిల్లాల వారీగా తీసుకుంటే, అనంతపురంలో 164, చిత్తూరులో 705, తూర్పుగోదావరి జిల్లాలో 691, గుంటూరులో 391, కడపలో 317, కృష్ణాలో 416, కర్నూలులో 88, నెల్లూరులో 228, ప్రకాశంలో 442, శ్రీకాకుళంలో 101, విశాఖపట్నంలో 168, విజయనగరంలో 159, పశ్చిమ గోదావరిలో 752 కేసులు నమోదయ్యాయి.


Tags :
|
|

Advertisement