Advertisement

ఏపీలో కొత్తగా కరోనా కేసులు ఎన్నంటే !

By: Sankar Sun, 20 Dec 2020 5:46 PM

ఏపీలో కొత్తగా కరోనా కేసులు ఎన్నంటే !


ఏపీలో ఇవాళ కొత్తగా 438 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వైరస్‌ బారినపడిన వారిలో 589 మంది కోలుకున్నారు. ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.

ఏపీలో ఇప్పటివరకు 8,78,723 కోవిడ్‌-19 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 8,67,445 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. మరో 4,202 మంది దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. 7,076 మంది ప్రాణాలు కోల్పోయారని వైద్య ఆరోగ్యశాఖ ఆదివారం నివేదికలో వెల్లడించింది.

గడిచిన 24 గంటల వ్యవధిలో 64,236 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఇప్పటివరకు 1,12,60,810 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొన్నారు.

Tags :
|
|

Advertisement