Advertisement

ఏపీలో తాజాగా 357 కరోనా పాజిటివ్ కేసులు

By: Sankar Thu, 24 Dec 2020 8:17 PM

ఏపీలో తాజాగా 357 కరోనా పాజిటివ్ కేసులు


ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు నిలకడగా అయిదు వందల లోపు నమోదు అయితున్నాయి ....అయినా కూడా కరోనా సెకండ్ వేవ్ బ్రిటన్ లో విజృంభించిన తరుణంలో ఎట్టి పరిస్థితులలో నిర్లక్ష్యంగా ఉండొద్దు అని అధికారులు సూచిస్తున్నారు..ఇక తాజగా ప్రభుత్వం కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది.

ఈ బులెటిన్ ప్రకారం ఏపీలో కొత్తగా 357 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 8,80,075 కు చేరింది. ఇందులో 8.69,124 లక్షల మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 3,862కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.

ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనాతో నలుగురు మృతి చెందారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన కరోనా మృతుల సంఖ్య 7,089 కు చేరింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 58 కేసులు నమోదయ్యాయి.

Tags :
|
|

Advertisement