Advertisement

ఏపీలో మళ్ళీ పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు

By: Sankar Wed, 30 Dec 2020 7:38 PM

ఏపీలో మళ్ళీ పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు


ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు మళ్ళీ పెరుగుతున్నాయి. నిన్నటి కరోనా బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో 326 కేసులు నమోదు కాగా, ఈరోజు ఆ సంఖ్య పెరిగింది.

ఈరోజు రిలీజ్ చేసిన కరోనా బులెటిన్ ప్రకారం కొత్తగా 349 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,81,948కి చేరింది. ఇందులో 8,71,588 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ కాగా, 3256 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.

ఇక కరోనా కారణంగా గడిచిన 24 గంటల్లో నలుగురు మృతి చెందారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 7104కి చేరింది. ఇకపోతే గడిచిన 24 గంటల్లో ఏపీలో 472 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.

Tags :
|
|

Advertisement