Advertisement

ఏపీలో తాజాగా 349 కొత్త కరోనా కేసులు...

By: Sankar Sun, 27 Dec 2020 9:39 PM

ఏపీలో తాజాగా 349 కొత్త కరోనా కేసులు...


ఏపీలో కరోనా కేసులు నిలకడగా అయిదు వందలకు దగ్గర్లో నమోదు అయితున్నాయి ..ఒకరోజు పెరిగితే మరొకరోజు తగ్గుతున్నాయి...అయితే కొత్త కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది...

ఇక తాజాగా ప్రభుత్వం కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. నేడు కొత్తగా 349 మందికి కరోనా సోకింది. దీంతో రాష్ట్రం లోని నమోదైన మొత్తం 8,81,061 పాజిటివ్ కేసు లకు గాను.. 8,70,342 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 3,625 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.

ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనాతో ఇద్దరు మరణించారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన కరోనా మృతుల సంఖ్య 7,094 కు చేరింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 105 కేసులు నమోదయ్యాయి.

Tags :
|
|

Advertisement