Advertisement

ఏపీలో తాజాగా 338 కరోనా పాజిటివ్ కేసులు

By: Sankar Thu, 31 Dec 2020 6:40 PM

ఏపీలో తాజాగా 338 కరోనా పాజిటివ్ కేసులు

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు మళ్ళీ పెరుగుతున్నాయి. నిన్నటి కరోనా బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో 349 కేసులు నమోదు కాగా, ఈరోజు ఆ సంఖ్య కాస్త తగ్గింది.

ఈరోజు రిలీజ్ చేసిన కరోనా బులెటిన్ ప్రకారం కొత్తగా 338 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,79,391 కి చేరింది. ఇందులో 8,69,021 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ కాగా, 3262 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.

ఇక కరోనా కారణంగా గడిచిన 24 గంటల్లో నలుగురు మృతి చెందారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 7,108 కి చేరింది. ఇకపోతే గడిచిన 24 గంటల్లో ఏపీలో 328 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.

Tags :
|
|

Advertisement