ఏపీలో భారీగా తగ్గిన కరోనా మరణాలు...
By: Sankar Fri, 09 Oct 2020 9:51 PM
ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ నిర్థారణ పరీక్షల సంఖ్య 64 లక్షలు దాటేసింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 70,521 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 5,145 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 7,44,864 గా ఉంది. కరోనా నుంచి కొత్తగా 6,110 మంది కోలుకోగా.. మొత్తం డిశ్చార్జి అయిన వారి సంఖ్య 6,91,040గా ఉంది..
గత 24 గంటల్లో కొత్తగా 31 మంది మృతి చెందగా.. మొత్తంగా రాష్ట్రంలో 6,159 కోవిడ్ మరణాలు ఉన్నాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 64,20,474 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. కాగా రాష్ట్రంలో మిలియన్ జనాభాకు 1,18,913మందికి కరోనా పరీక్షలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ రేటు 11.60గా ఉంది..
కరోనా మహమ్మారి బారిన పడి గడిచిన 24 గంటల్లో ప్రకాశం జిల్లాలో ఐదుగురు, చిత్తూరులో నలుగురు, విశాఖపట్నంలో నలుగురు, అనంతపురంలో ముగ్గురు, తూర్పు గోదావరిలో ముగ్గురు, కృష్ణా జిల్లాలో ముగ్గురు, నెల్లూరులో ముగ్గురు, గుంటూరులో ఒకరు, కడపలో ఒకరు శ్రీకాకుళంలో ఒకరు, విజయనగరంలో ఒకరు, పశ్చిమ గోదావరిలో ఒకరు ఒకరు మృత్యువాత పడ్డారు.