ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ ..భారీగా తగ్గుతున్న కరోనా పాజిటివ్ కేసులు
By: Sankar Sun, 25 Oct 2020 5:18 PM
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 2997 కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,07,023కి చేరింది.
ఇందులో 7,69,576 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 30,860 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనాతో 21 మంది మృతి చెందారు. దీంతో ఏపీలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 6587కి చేరింది.
జిల్లాల వారీగా చూసుకుంటే, అనంతపూర్ లో 108,చిత్తూరులో 466, తూర్పు గోదావరిలో 254, గుంటూరులో 301, కడపలో 153, కృష్ణాలో 358, కర్నూల్ లో 67, నెల్లూరులో 96, ప్రకాశంలో 340, శ్రీకాకుళంలో 86, విశాఖపట్నంలో 187, విజయనగరంలో 89, పశ్చిమగోదావరి జిల్లాలో 492 కేసులు నమోదయ్యాయి.
Tags :
ap |
reports |
2997 |