Advertisement

  • ఏపీలో తాజాగా 28 కరోనా మరణాలు..తగ్గుముఖం పట్టిన పాజిటివ్ కేసులు

ఏపీలో తాజాగా 28 కరోనా మరణాలు..తగ్గుముఖం పట్టిన పాజిటివ్ కేసులు

By: Sankar Wed, 14 Oct 2020 8:22 PM

ఏపీలో తాజాగా 28 కరోనా మరణాలు..తగ్గుముఖం పట్టిన పాజిటివ్ కేసులు


ఆంధ్రప్రదేశ్ లో కరోనా ఉధృతి ఎంత మాత్రం తగ్గడం లేదు. ఇప్పటికే రాష్ట్రంలో 7.67 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. తాజాగా ఏపీ ఆరోగ్యశాఖ కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది.

ఈ బులెటిన్ ప్రకారం ఏపీలో గడిచిన 24 గంటల్లో 3,892 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 767465కి చేరింది. ఇందులో 41669 కేసులు యాక్టివ్ గా ఉంటే, 719477 మంది ఇప్పటికే కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.

ఇక ఇదిలా ఉంటె, గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనాతో 28 మంది మృతి చెందారు. దీంతో ఏపీలో నమోదైన మొత్తం మరణాల సంఖ్య 6319కి చేరింది. ఇక జిల్లాల వారీగా తీసుకుంటే, అనంతపురంలో 290, చిత్తూరులో 405, తూర్పుగోదావరి జిల్లాలో 607, గుంటూరులో 345, కడపలో 332, కృష్ణాలో 458, కర్నూలులో 104, నెల్లూరులో 219, ప్రకాశంలో 146, శ్రీకాకుళంలో 154, విశాఖపట్నంలో 163, విజయనగరంలో 151, పశ్చిమ గోదావరిలో 518 కేసులు నమోదయ్యాయి.

Tags :
|
|
|
|

Advertisement