Advertisement

ఏపీలో తాజాగా ఎన్ని కరోనా కేసులో తెలుసా !

By: Sankar Thu, 05 Nov 2020 7:42 PM

ఏపీలో తాజాగా ఎన్ని కరోనా కేసులో తెలుసా !


ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసుల ఉధృతి కొనసాగుతోంది. ఇప్పటికే కరోనా కేసులు 83.59 లక్షలు దాటిపోయాయి. అయితే ఆ ఉదృతి నెమ్మదిగా తగ్గుతోంది.

తాజాగా వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం గడిచిన 24 గంటల్లో ఏపీలో 2,745 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 835953కి చేరింది. ఇందులో 21878 కేసులు యాక్టివ్ గా ఉంటె, 807318 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.

ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో 13 కరోనా మరణాలు సంభవించాయి. దీంతో ఏపీలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 6757కి చేరింది. ఇక ఇదిలా ఉంటె, జిల్లాల వారీగా నమోదైన కరోనా కేసుల వివరాలు ఇలా ఉన్నాయి. అనంతపూర్ లో 218, చిత్తూరులో 286, తూర్పుగోదావరి జిల్లాలో 407, గుంటూరులో 297, కడపలో 125, కృష్ణాలో 398, కర్నూలులో 38, నెల్లూరులో 130, ప్రకాశంలో 124, శ్రీకాకుళంలో 91, విశాఖపట్నంలో 120, విజయనగరంలో 83, పశ్చిమ గోదావరిలో 428 కేసులు నమోదయ్యాయి.

Tags :
|
|

Advertisement