Advertisement

ఏపీలో పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు...

By: Sankar Sun, 08 Nov 2020 7:33 PM

ఏపీలో పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు...


ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా కేసుల ఉధృతి కొన సాగుతోంది. ఇప్పటికే కరోనా కేసులు 84.29 లక్షలు దాటిపోయాయి. అయితే ఆ ఉదృతి నెమ్మదిగా తగ్గుతోంది.

తాజాగా వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం గడిచిన 24 గంటల్లో ఏపీలో 2,237 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 842967కి చేరింది. ఇందులో 21403 కేసులు యాక్టివ్ గా ఉంటె, 814773 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.

ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో 12 కరోనా మరణాలు సంభవించాయి. దీంతో ఏపీలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 6791కి చేరింది. ఇక ఇదిలా ఉంటె, జిల్లాల వారీగా నమోదైన కరోనా కేసుల వివరాలు ఇలా ఉన్నాయి. అనంతపూర్ లో 109, చిత్తూరులో 329, తూర్పుగోదావరి జిల్లాలో 188, గుంటూరులో 364, కడపలో 84, కృష్ణాలో 277, కర్నూలులో 24, నెల్లూరులో 88, ప్రకాశంలో 83, శ్రీకాకుళంలో 117, విశాఖపట్నంలో 108, విజయనగరంలో 87, పశ్చిమ గోదావరిలో 379 కేసులు నమోదయ్యాయి.

Tags :
|
|

Advertisement