ఏపీలో రికార్డు స్థాయిలో కరోనా పరీక్షలు
By: Sankar Wed, 11 Nov 2020 7:46 PM
ఆంధ్రప్రదేశ్లో రికార్డు స్థాయిలో కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 70,405 నమూనాలు పరీక్షించగా 1732 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
దీంతో మొత్తం కేసుల సంఖ్య 8,47,977కు చేరింది. కొత్తగా 14మంది కరోనా బాధితులు మృతి చెందడంతో ఆ సంఖ్య 6828కి చేరింది. ఈ మేరకు బుధవారం రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఇక గడిచిన 24 గంటల్లో 1,761మంది కోవిడ్ను జయించి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు 88,63,340మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 20,915 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
ఇక జిల్లాల వారీగా చూసుకుంటే ఈస్ట్ గోదావరిలో అత్యధికంగా 344 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి..ఇక ఆ తర్వాత కృష్ణ లో 246 , వెస్ట్ గోదావరిలో 227 లో , గుంటూరు లో 195 , చిత్తూరు లో 198 కేసులు నమోదు అయ్యాయి...