Advertisement

ఏపీలో కరోనా తో తాజాగా 11 మంది మృతి

By: Sankar Thu, 19 Nov 2020 7:19 PM

ఏపీలో కరోనా తో తాజాగా 11 మంది మృతి


ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా ఉధృతి ఏ మాత్రం తగ్గడం లేదు. ఇప్పటికే ఏపీలో 8.58 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. తాజా కరోనా బులెటిన్ ప్రకారం ఏపీలో కొత్తగా 1,593 కరోనా కేసులు నమోదయ్యాయి.

దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,58,711 కి చేరింది. ఇందులో 8,35,801 మంది ఇప్పటికే డిశ్చార్జ్ కాగా, 16,000 కేసులు ఇంకా యాక్టివ్ గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనాతో 11 మంది మృతి చెందారు.

దీంతో ఏపీలో ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 6,910 కి చేరింది. అలానే జిల్లా వారీగా చూస్తే అనంతపురంలో 60, చిత్తూరులో 198, తూర్పుగోదావరి జిల్లాలో 183, గుంటూరులో 206, కడపలో 58, కృష్ణాలో 196, కర్నూలులో 14, నెల్లూరులో 40, ప్రకాశంలో 43, శ్రీకాకుళంలో 28, విశాఖపట్నంలో 45, విజయనగరంలో 18, పశ్చిమ గోదావరిలో 227కేసులు నమోదయ్యాయి.

Tags :
|
|

Advertisement