Advertisement

ఏపీలో నిలకడగా కరోనా పాజిటివ్ కేసులు...

By: Sankar Fri, 20 Nov 2020 7:34 PM

ఏపీలో నిలకడగా కరోనా పాజిటివ్ కేసులు...


ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,221 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,59,932కి చేరింది.

ఇందులో 15,382 యాక్టివ్ కేసులు ఉండగా.. 8,37,630 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు నిన్న వైరస్ కారణంగా 10 మంది మృతి చెందటంతో.. మొత్తం మరణాల సంఖ్య 6,920కు చేరుకుంది. ఇక నిన్న 1,829 మంది కరోనా నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారు. నేటితో రాష్ట్రవ్యాప్తంగా 94.74 సాంపిల్స్‌ను పరీక్షించారు….

నిన్న జిల్లాల వారీగా నమోదైన కరోనా కేసులు ఇలా ఉన్నాయి.. అనంతపురం 41, చిత్తూరు 175, తూర్పుగోదావరి 202, గుంటూరు 144, కడప 65, కృష్ణా 198, కర్నూలు 19, నెల్లూరు 47, ప్రకాశం 50, శ్రీకాకుళం 34, విశాఖపట్నం 69, విజయనగరం 32, పశ్చిమ గోదావరి 145 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. కాగా, తూర్పుగోదావరి జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య 1,21,325కి చేరింది. అలాగే చిత్తూరులో అత్యధికంగా 818 మంది కరోనాతో మరణించారు.

Tags :
|

Advertisement