Advertisement

ఏపీలో మళ్ళీ పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు

By: Sankar Tue, 24 Nov 2020 7:27 PM

ఏపీలో మళ్ళీ పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు


ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా ఉధృతి ఏ మాత్రం తగ్గడం లేదు. తాజా కరోనా బులెటిన్ ప్రకారం ఏపీలో కొత్తగా 1,085 కరోనా కేసులు నమోదయ్యాయి.

దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 863843 కి చేరింది. అందులో 843863 మంది ఇప్పటికే డిశ్చార్జ్ కాగా, 13024 కేసులు ఇంకా యాక్టివ్ గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనాతో 8 మంది మృతి చెందారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 6956కి చేరింది.

అలాగే జిల్లాల వారీగా చూస్తే అనంతపురంలో 10, చిత్తూరు 142, తూర్పుగోదావరి జిల్లాలో 116, గుంటూరు 126, కడపలో 57, కృష్ణాలో 224, కర్నూలులో 31, నెల్లూరు 50, ప్రకాశంలో 42, శ్రీకాకుళంలో 26, విశాఖపట్నంలో 86, విజయనగరంలో 37, పశ్చిమ గోదావరిలో 138 కేసులు నమోదయ్యాయి.

Tags :
|
|

Advertisement