Advertisement

  • ఏపీలో ఏ మాత్రం తగ్గని కరోనా ఉదృతి ..ఆందోళన కలిగిస్తున్న మరణాల సంఖ్య

ఏపీలో ఏ మాత్రం తగ్గని కరోనా ఉదృతి ..ఆందోళన కలిగిస్తున్న మరణాల సంఖ్య

By: Sankar Wed, 26 Aug 2020 7:53 PM

ఏపీలో ఏ మాత్రం తగ్గని కరోనా ఉదృతి ..ఆందోళన కలిగిస్తున్న మరణాల సంఖ్య


ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ కేసులు రోజురోజుకూ భారీగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలో బుధవారం మళ్లీ కరోనా విజృంభించింది. కరోనా పాజిటివ్ కేసులు 10 వేలకు పైగా నమోదయ్యాయి. అలాగే కరోనా బారిన పడి మరో 81 మంది మృత్యువాతపడ్డారు.

బుధవారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్‌లో గడిచిన 24 గంటల్లో 61,838 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 10,830 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కరోనా వైరస్ కేసులు 3,82,469కు పెరిగాయి.

గడిచిన 24 గంటల్లో 81 మంది కరోనా మహమ్మారి బారిన పడి మృత్యువాత పడ్డారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కరోనా వల్ల మృతి చెందిన వారి సంఖ్య 3,541కు పెరిగింది. ఇక, కరోనా మహమ్మారి బారిన పడి గడిచిన 24 గంటల్లో చిత్తూరు జిల్లాలో తూర్పు గోదావరి జిల్లాలో 11 మంది, ప్రకాశంలో 9 మంది, చిత్తూరులో 8 మంది, కడపలో 8 మంది, అనంతపురంలో ఆదరుగురు, పశ్చిమ గోదావరిలో ఆరుగురు, కృష్ణాలో ఐదుగురు, కర్నూలులో ఐదుగురు, నెల్లూరులో ఐదుగురు, విశాఖపట్నంలో ఐదుగురు, విజయనగరంలో ఐదుగురు, గుంటూరులో నలుగురు, శ్రీకాకుళంలో నలుగురు మృత్యువాత పడ్డారు.

ఇక, మంగళవారం 8,473 మంది కరోనా మహమ్మారిని పూర్తిగా జయించి డిశ్చార్జి అయ్యారని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా నమోదైన మొత్తం 3,82,469 పాజిటివ్ కేసులకు గాను, 2,86,720 మంది డిశ్చార్జి కాగా, ప్రస్తుతం 92,208 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

Tags :
|
|
|
|

Advertisement