ఏపీలో ఏ మాత్రం తగ్గని కరోనా... 74 తాజాగా మరణాలు
By: Sankar Wed, 09 Sept 2020 7:26 PM
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే
రాష్ట్రంలో ఐదు లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. తాజా హెల్త్ బులెటిన్
ప్రకారం ఏపీలో 10,418 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో నమోదైన మొత్తం
కరోనా కేసుల సంఖ్య 5, 27, 513 కి చేరింది. ఇందులో 97271 కేసులు యాక్టివ్
గా ఉండగా, 425607 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇక గడిచిన 24 గంటల్లో
ఏపీలో కరోనాతో 74 మంది మరణించారు. దీంతో ఏపీలో నమోదైన మొత్తం కరోనా మరణాల
సంఖ్య 4634కి చేరింది.
తాజా హెల్త్ బులెటిన్ ప్రకారం ఏపీలోని జిల్లాల్లో నమోదైన కేసుల వివరాలు
ఇలా ఉన్నాయి. అనంతపూర్ లో 801, చిత్తూరులో 887, తూర్పు గోదావరి జిల్లాలో
1399, గుంటూరులో 707, కడపలో 785, కృష్ణా జిల్లాలో 350, కర్నూలులో 484,
నెల్లూరులో 949, ప్రకాశం జిల్లాలో 1271, శ్రీకాకుళం జిల్లాలో 660,
విశాఖపట్నం జిల్లాలో 414, విజయనగరంలో 577, పశ్చిమ గోదావరి జిల్లాలో 1134
కేసులు నమోదయ్యాయి.