Advertisement

  • ఏపీలో రోజుకొక రికార్డు నమోదు చేస్తున్న కరోనా పాజిటివ్ కేసులు ..తాజాగా 10376 మంది కరోనా నిర్దారణ

ఏపీలో రోజుకొక రికార్డు నమోదు చేస్తున్న కరోనా పాజిటివ్ కేసులు ..తాజాగా 10376 మంది కరోనా నిర్దారణ

By: Sankar Sat, 01 Aug 2020 08:37 AM

ఏపీలో రోజుకొక రికార్డు నమోదు చేస్తున్న కరోనా పాజిటివ్ కేసులు ..తాజాగా 10376 మంది కరోనా నిర్దారణ



ఏపీలో కరోనా కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదు ..అలాగే టెస్టులు కూడా అదే స్థాయిలో జరుగుతున్నాయి.. గడిచిన 24 గంటల్లో 61,699 శాంపిల్స్‌ పరీక్షించగా.. 10,376 మంది కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యారు. 68 మంది మృత్యువాత పడ్డారు. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,38,038కి చేరగా.. మృతుల సంఖ్య 1,349కి పెరిగింది.

గడిచిన 24 గంటల్లో వైరస్‌ నుంచి కోలుకుని 3,822 మంది డిశ్చార్‌ అయ్యారు. దీంతో ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 60,969 కి చేరింది. ప్రస్తుతం 75,720 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. మరోవైపు ఇప్పటి వరకు 19,51,776 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది..

ఇక జిల్లాల వారీగా చూసుకుంటే అత్యధికంగా అనంతపురం జిల్లాలో 1387 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా , ఈస్ట్ గోదావరిలో 1215 కేసులు , కర్నూలు లో 1124 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి ..విశాఖపట్నంలో మరియు వెస్ట్ గోదావరిలో , గుంటూరు జిల్లాలలో 900 కి పైగా కేసులు నమోదు అయ్యాయి..

Tags :
|
|

Advertisement