Advertisement

ఏపీలో నాలుగువేలు దాటిన కరోనా మృతులు

By: Sankar Tue, 01 Sept 2020 7:49 PM

ఏపీలో నాలుగువేలు దాటిన కరోనా మృతులు


ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ మహమ్మారి విలయతాండవం చేస్తోంది. గత వారం రోజులుగా ప్రతి రోజూ 10 వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. అలాగే కరోనా మరణాలు సైతం మళ్లీ ఒక్కసారిగా పెరిగాయి. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్‌లో గడిచిన 24 గంటల్లో 59,834 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 10,368 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కరోనా వైరస్ కేసులు 4,45,139కు పెరిగాయి.

అలాగే రాష్ట్రంలో కరోనా వైరస్ మరణాలు కూడా ఒక్కసారిగా పెరిగాయి. మంగళవారం ఒక్కరోజే కరోనా మహమ్మారి బారినపడి 94 మంది మరణించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కరోనా వల్ల మృతి చెందిన వారి సంఖ్య 4,053కు పెరిగింది. అలాగే కరోనా మహమ్మారి బారిన పడి గడిచిన 24 గంటల్లో చిత్తూరు జిల్లాలో 14 మంది, పశ్చిమ గోదావరిలో 11 మంది, తూర్పు గోదావరిలో 10 మంది, అనంతపురంలో ఏడుగురు, గుంటూరులో ఏడుగురు, విశాఖపట్నంలో ఏడుగురు, నెల్లూరులో ఆరుగురు, కడపలో ఐదుగురు, కృష్ణా జిల్లా నలుగురు, కర్నూలులో నలుగురు, శ్రీకాకుళంలో నలుగురు, ప్రకాశంలో ముగ్గురు, విజయనగరంలో ఇద్దరు మృత్యువాత పడ్డారు.

అలాగే మంగళవారం 9,350 మంది కరోనా మహమ్మారిని పూర్తిగా జయించి డిశ్చార్జి అయ్యారని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా నమోదైన మొత్తం 4,45,139 పాజిటివ్ కేసులకు గాను, 3,39,876 మంది డిశ్చార్జి కాగా, ప్రస్తుతం 1,01,210 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు

Tags :
|
|

Advertisement