Advertisement

ఏపీలో భారీగానే కరోనా కేసులు.. 68 కొత్త మరణాలు

By: Sankar Thu, 10 Sept 2020 5:52 PM

ఏపీలో భారీగానే కరోనా కేసులు.. 68 కొత్త మరణాలు


ఏపీలో కరోనా వైరస్ కేసులు సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదు. గత పది రోజులుగా కేసుల సంఖ్య పెరుగుతూనే వస్తోంది. గురువారం విడుదల చేసిన బులిటెన్‌ ప్రకారం.. గత 24 గంటల్లో 72,229 శాంపిల్స్ పరీక్షించగా మరో 10175 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య 5,76,687కు చేరింది. గడచిన 24 గంటల్లో 68మంది చనిపోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 4702కి చేరింది. గత 24 గంటల్లో 10,040మంది కోలుకున్నారని ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 4,35,647నమోదయ్యింది. మరో 97,338మంది హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారని పేర్కొంది.

గత 24 గంటల్లో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 1412, ప్రకాశం జిల్లాలో 1386, పశ్చిమగోదావరి జిల్లా 1139, చిత్తూరు జిల్లా 968, గుంటూరు జిల్లా 838, నెల్లూరు జిల్లా 823, శ్రీకాకుళం జిల్లా 664, కడప జిల్లాలో 576, కృష్ణా జిల్లాలో 545, విజయనగరం జిల్లా 516, కర్నూలు జిల్లా 482, అనంతపురం జిల్లా 422, విశాఖపట్నం జిల్లాలో 404 కేసులు నమోదయ్యాయి.

కరోనా కారణంగా నిన్న చిత్తూరులో 9, కడపలో 9, నెల్లూరులో 9, ప్రకాశంలో 7, కృష్ణాలో 7, అనంతపూరంలో 6, తూర్పు గోదావరిలో 5, పశ్చిమగోదావరిలో 5, శ్రీకాకుళంలో 4, కర్నూలులో 5, విశాఖపట్నంలో 4, గుంటూరులో 2, విజయనగరంలో 1 చొప్పున మరణించారు.

Tags :
|
|

Advertisement