Advertisement

  • ఏపీలో కాస్త తగ్గిన కరోనా ..తాజాగా 8943 పాజిటివ్ కేసులు నమోదు

ఏపీలో కాస్త తగ్గిన కరోనా ..తాజాగా 8943 పాజిటివ్ కేసులు నమోదు

By: Sankar Fri, 14 Aug 2020 6:59 PM

ఏపీలో కాస్త తగ్గిన కరోనా ..తాజాగా 8943 పాజిటివ్ కేసులు నమోదు


ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కోవిడ్‌ ప‌రీక్ష‌లు జోరుగా కొన‌సాగుతున్నాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో 53,026 మందికి క‌రోనా ప‌రీక్ష‌లు జ‌ర‌ప‌గా 8,943 మందికి పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,70,190కు చేరింది. తాజాగా 9,779 మంది కోవిడ్ నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్య‌వంతులుగా ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జి అయ్యారు.

దీంతో ఇప్పటి‌వ‌ర‌కు క‌రోనాను జ‌యించిన వారి సంఖ్య 1,80,703కు చేరుకుంది. తాజాగా వైర‌స్ బాధితుల్లో 97 మంది మ‌ర‌ణించ‌గా మొత్తం మృతుల సంఖ్య 2475గా ఉంది. ప్ర‌స్తుతం 89,907 యాక్టివ్ కేసులున్నాయి. ఈ మేర‌కు శుక్ర‌వారం ఆంధ్ర‌ప్ర‌దేశ్ వైద్యారోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌లో పేర్కొంది. రాష్ట్రంలో ఇప్ప‌టివ‌ర‌కు 27,58,485 కరోనా పరీక్షలు నిర్వ‌హించిన‌ట్లు తెలిపింది

ఇక జిల్లాల వారీగా చూసుకుంటే గత 24 గంటల్లో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 1146, చిత్తూరు జిల్లాలో 987, కర్నూలు జిల్లాలో 956, విశాఖపట్నం జిల్లాలో 885, అనంతపురం జిల్లాలో 762, పశ్చిమగోదావరి జిల్లాలో 748, నెల్లూరు జిల్లాలో 669, విజయనగరం జిల్లాలో 548, శ్రీకాకుళం జిల్లాలో 547, కడప జిల్లాలో 530, గుంటూరు జిల్లాలో 527, కృష్ణా జిల్లాలో 338, ప్రకాశం జిల్లాలో 300 కేసులు నమోదయ్యాయి

Tags :
|
|
|
|

Advertisement