Advertisement

  • ఏపీలో తగ్గని కరోనా పాజిటివ్ కేసులు ..కొత్తగా 8555 పాజిటివ్ కేసులు నమోదు

ఏపీలో తగ్గని కరోనా పాజిటివ్ కేసులు ..కొత్తగా 8555 పాజిటివ్ కేసులు నమోదు

By: Sankar Sun, 02 Aug 2020 7:50 PM

ఏపీలో తగ్గని కరోనా పాజిటివ్ కేసులు ..కొత్తగా 8555 పాజిటివ్ కేసులు నమోదు



ఆంధ్రప్రదేశ్‌లో శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం 9 గంటల వరకూ 52,834 కరోనా పరీక్షలు నిర్వహించడంతో మొత్తం కరోనా పరీక్షల సంఖ్య 20, 65, 407 కు చేరింది. కొత్తగా 8, 555 మందికి పాజిటివ్‌గా తేలింది. దాంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,58,764 చేరినట్లు వైద్యారోగ్యశాఖ బులెటిన్‌లో పేర్కొంది.

అదే సయమంలో గడిచిన 24 గంటల్లో 6,272 మంది పూర్తి ఆరోగ్యంగా డిశ్చార్జ్‌ కావడం మొత్తం కోలుకున్న వారి సంఖ్య 82, 886కు చేరింది. మరొకవైపు ఏపీలో తాజాగా కరోనాతో 67 మంది మృతిచెందడంతో ఇప్పటివరకూ ఆ వైరస్‌ బారిన పడి మరణించిన వారి సంఖ్య 1,474కు చేరింది. ఇక యాక్టివ్‌ కేసులు 74,404గా ఉన్నాయి..

ఇక జిల్లాల వారీగా చూసుకుంటే విశాఖపట్నం లో 1227 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా , కర్నూలు లో 996 పాజిటివ్ కేసులు , ఈస్ట్ గోదావరిలో 930 , చిత్తూరు లో 781 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి..ఇక విజయనగరం , అనంతపురం , గుంటూరు లలో 600 పైగా పాజిటివ్ నమోదు అయ్యాయి

Tags :
|
|
|
|

Advertisement