Advertisement

  • ఏపీలో లక్షకు చేరిన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య..

ఏపీలో లక్షకు చేరిన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య..

By: Sankar Tue, 28 July 2020 08:42 AM

ఏపీలో లక్షకు చేరిన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య..



ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా కేసులు మరియు కరోనా టెస్టులు రెండు రికార్డుల మోత మోగిస్తున్నాయి .. గడిచిన 24 గంటల్లో 43,127 మందికి పరీక్షలు నిర్వహించగా.. 6,051 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. కరోనా కారణంగా 49 మంది ‍ప్రాణాలు కోల్పోయారు. తాజా గణాంకాలతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 99,454కి చేరింది. మృతుల సంఖ్య 1090కి పెరిగింది.

వైరస్‌ నుంచి కోలుకుని ఈరోజు 3,234 మంది డిశ్చార్జ్‌ అ‍య్యారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 49,558కి పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 51,701 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ సోమవారం హెల్త్‌బులెటెన్‌ విడుదల చేసింది. మరోవైపు రాష్ట్రంలో కరోనా నిర్ధారణ పరీక్షలు రోజురోజుకూ పెరుగుతున్నాయి.

ఇక జిల్లాల వారీగా చూసుకుంటే ఈస్ట్ గోదావరిలో అత్యధికంగా 1210 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి..ఆ తర్వాత గుంటూరు లో 744 , కర్నూలు లో 664, విశాఖపట్నంలో 655 , అనంతపూర్ లో 524 , వెస్ట్ గోదావరిలో 408 పాజిటివ్ కేసులను గుర్తించారు..ఇక చిత్తూరు , కడప , ప్రకాశం జిల్లాలలో మూడొందలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి ..

Tags :
|
|
|
|
|

Advertisement