Advertisement

ఏపీలో మళ్ళీ 1900 పైగా కరోనా కేసులు ..

By: Sankar Tue, 14 July 2020 2:56 PM

ఏపీలో మళ్ళీ 1900 పైగా కరోనా కేసులు ..


ఏపీలో భారీగా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి ..గత నాలుగు అయిదు రోజులుగా కేసులు విపరీతంగా నమోదు అవుతున్నాయి ..తాజాగా గత 24 గంటల్లో 1916 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి ..ఇందులో ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 1,908 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీటితో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 8 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.

ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా వైరస్‌ సోకిన వారి సంఖ్య 33,019కి చేరుకుంది. గత 24 గంటల్లో కోవిడ్‌ నుంచి కోలుకుని 952 మంది క్షేమంగా డిశ్చార్జ్‌ కాగా, ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 17,467 మంది డిశ్చార్జ్‌ అయ్యారు.

గడిచిన 24 గంటల్లో కరోనా బారినపడి అనంతపురంలో పది మంది, పశ్చిమ గోదావరిలో తొమ్మిది మంది, చిత్తూరులో ఐదుగురు, తూర్పుగోదావరిలో ఐదుగురు, కడపలో ఐదుగురు, కర్నూలులో ముగ్గురు, ప్రకాశంలో ముగ్గురు, విశాఖపట్నంలో ఇద్దరు, విజయనగరంలో ఒకరు.. మొత్తం 43 మరణించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 408 మంది మృతి చెందారు. గత 24 గంటల్లో 22,670 శాంపిల్స్‌ను పరీక్షించగా, ఇప్పటివరకు ఏపీలో 11,95,766 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 15,144 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

Tags :
|
|
|
|
|

Advertisement