ఏపీలో ఆగని కరోనా విజృంభణ ..పదకొండు వేలకు చేరువలో ఒక్కరోజు పాజిటివ్ కేసులు
By: Sankar Sun, 09 Aug 2020 8:28 PM
ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో 62,912 కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయగా 10,820 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,27,860 కు చేరింది. తాజా పరీక్షల్లో 33,831 ట్రూనాట్ పద్ధతిలో, 29,081 ర్యాపిడ్ టెస్టింగ్ పద్ధతిలో చేశారు.
కొత్తగా 9,097 మంది వైరస్ బాధితులు కోలుకుని ఆదివారం డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కోలుకున్నవారి మొత్తం సంఖ్య 1,38,712 కి చేరింది. రాష్ట్రవ్యాప్తంగా 87,112 యాక్టివ్ కేసులున్నాయి. వైరస్ బాధితుల్లో తాజాగా 97 మంది మృతి చెందడంతో మొత్తం మరణాల సంఖ్య 2036 కు చేరింది. ఈమేరకు ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్లో పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 24,87,305 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశామని వెల్లడించింది.
ఇక జిల్లాల వారీగా చూసుకుంటే ఈస్ట్ గోదావరి 1543, కర్నూలు లో 1399, వెస్ట్ గోదావరి 1132, విశాఖపట్నం లో 961, గుంటూరు లో 881, అనంతపూర్ లో 858, చిత్తూరు లో 848, కడప లో 823, నెల్లూరు 696, కృష్ణ 439, ప్రకాశం 430, శ్రీకాకుళం 452 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి..