ఏపీలో రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు ..తాజాగా 10,548 మందికి పాజిటివ్
By: Sankar Sat, 29 Aug 2020 8:23 PM
ఆంధ్రప్రదేశ్లో గత 24 గంటల్లో 62,024 మందికి కరోనా వైరస్ పరీక్షలు చేయగా 10,548 మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,14,164కు చేరింది.
ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ శనివారం కరోనాపై హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. కరోనా నుంచి కోలుకుని నిన్న ఒక్కరోజే 8,976 మంది డిశ్చార్జ్ అవ్వగా, ఇప్పటివరకూ మొత్తం 3,12,687 మంది డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కరోనా బారిన పడి 82 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 97,681 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకూ 36,03,345 మందికి కరోనా పరీక్షలు చేశారు..
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కరోనా వల్ల మృతి చెందిన వారి సంఖ్య 3,796కు పెరిగింది. అలాగే కరోనా మహమ్మారి బారిన పడి గడిచిన 24 గంటల్లో చిత్తూరు జిల్లాలో 15 మంది, నెల్లూరులో 11 మంది, తూర్పు గోదావరిలో 8 మంది, పశ్చిమ గోదావరిలో 8 మంది, అనంతపురంలో ఆరుగురు, గుంటూరులో ఆరుగురు, కర్నూలులో ఆరుగురు, ప్రకాశంలో ఐదుగురు, విశాఖపట్నంలో ఐదుగురు, శ్రీకాకుళంలో నలుగురు, విజయనగరంలో నలుగురు, కడపలో ఇద్దరు, కృష్ణా జిల్లాలో ఇద్దరు మృత్యువాత పడ్డారు.