Advertisement

  • ఏపీలో మళ్లీ విజృంభించిన కరోనా ..కొత్తగా పదివేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు

ఏపీలో మళ్లీ విజృంభించిన కరోనా ..కొత్తగా పదివేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు

By: Sankar Wed, 05 Aug 2020 9:16 PM

ఏపీలో మళ్లీ విజృంభించిన కరోనా ..కొత్తగా పదివేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు



ఆంధ‌ప్ర‌దేశ్‌లో రికార్డు స్థాయిలో క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్షలు చేస్తున్నారు. దీంతో బుధ‌వారం కేసుల సంఖ్య మ‌రోసారి‌ ప‌ది వేలు దాటింది. గ‌డిచిన 24 గంట‌ల్లో 60,576 క‌రోనా వైర‌స్‌ ప‌రీక్ష‌లు చేయ‌గా 10,128 పాజిటివ్ కేసులు న‌మోదైన‌ట్లు వైద్యారోగ్య శాఖ బుధ‌వారం హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.

దీంతో మొత్తం ప‌రీక్ష‌ల సంఖ్య 22,35,646కు చేరుకోగా మొత్తం కేసుల సంఖ్య 1,86,461గా న‌మోదైంది. కొత్త‌గా 8,729 మంది క‌రోనాను జ‌యించి ఆసుప‌త్రి నుంచి డిశ్చార్జి అవ‌గా మొత్తం కోలుకున్న వారి సంఖ్య 1,04,354కు చేరింది. తాజాగా 77 మంది కోవిడ్‌తో ప్రాణాలు కోల్పోవ‌డంతో ఇప్ప‌టివ‌ర‌కు మర‌ణించిన వారి సంఖ్య 1681కు చేరింది. ప్ర‌స్తుతం 80,426 యాక్టివ్ కేసులున్నాయి..

ఇక జిల్లాల వారీగా చూసుకుంటే ఈస్ట్ గోదావరిలో అత్యధికంగా 1544 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి..ఆ తరవాత అత్యధికంగా కర్నూలు లో 1368 పాజిటివ్ కేసులు వచ్చాయి..ఇక అనంతపురం లో 1260 పాజిటివ్ , విశాఖపట్నం లో 842 , గుంటూరు , కడపలో వరుసగా 730, 729 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి..

Tags :
|
|
|
|

Advertisement