Advertisement

ఏపీలో కొత్తగా వెయ్యికి పైగా కరోనా కేసులు

By: Sankar Wed, 08 July 2020 2:59 PM

ఏపీలో కొత్తగా వెయ్యికి పైగా కరోనా కేసులు



ఏపీలో కరోనా వణికిస్తూనే ఉంది.. గత నాలుగు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా పరిస్థితిలో ఎలాంటి మార్పు రావడం లేదు. రోజు రోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గత 24 గంటల్లో 27,643 మందికి పరీక్షలు నిర్వహించగా 1051 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి 9 మందికి.. ఇతర దేశాల నుంచి వచ్చిన ఇద్దరికి వైరస్ సోకింది.. దీంతో మొత్తం కేసులు 1062కు చేరాయి.

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య 22259కు చేరింది. గడచిన 24 గంటల్లో 12మంది చనిపోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 264కి చేరింది. గత 24 గంటల్లో 1332మంది కోలుకున్నారని ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 11101 నమోదయ్యింది. మరో 10894మంది హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారని పేర్కొంది.

గత 24 గంటల్లో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 258, గుంటూరు జిల్లాలో 173, తూర్పుగోదావరి జిల్లాలో 125, అనంతపురం జిల్లాలో 87, కడప జిల్లాలో 71, కృష్ణా జిల్లాలో 70, నెల్లూరు జిల్లాలో 63, కర్నూలు జిల్లాలో 51, పశ్చిమగోదావరి జిల్లాలో 47, విజయనగరం జిల్లాలో 38, విశాఖపట్నం జిల్లాలో 38, శ్రీకాకుళం జిల్లాలో 31, ప్రకాశం జిల్లాలో 2 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో అత్యధికంగా కర్నూలు జిల్లాలో మొత్తం 2722 పాజిటివ్ కేసులు.. తర్వాత అనంతపురం జిల్లాలో కేసులు 2568కు చేరాయి. గుంటూరు జిల్లాలో 2435 కేసులు ఉన్నాయి.

Tags :
|
|
|
|
|

Advertisement