Advertisement

  • స్వర్ణ ప్యాలస్ అగ్ని ప్రమాదం ఘటనపై హైకోర్ట్ కీలక వ్యాఖ్యలు

స్వర్ణ ప్యాలస్ అగ్ని ప్రమాదం ఘటనపై హైకోర్ట్ కీలక వ్యాఖ్యలు

By: Sankar Tue, 25 Aug 2020 9:02 PM

స్వర్ణ ప్యాలస్ అగ్ని ప్రమాదం ఘటనపై హైకోర్ట్ కీలక వ్యాఖ్యలు


విజయవాడలోని స్వర్ణప్యాలెస్‌ అగ్నిప్రమాదం వ్యవహారంలో రమేష్ ఆస్పత్రి ఎండీ, చైర్మన్‌ రమేష్ బాబుపై తదుపరి చర్యలు నిలిపివేయాలని ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఉన్నత న్యాయస్థానం మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అగ్నిప్రమాదం నేపథ్యంలో తమపై నమోదైన కేసు కొట్టివేయాలంటూ రమేష్ ఆస్పత్రి యాజమాన్యం హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసింది. ఆస్పత్రి ఎండీ రమేష్‌బాబు, సీతారామ్మోహన్‌రావు వేర్వేరుగా క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.

స్వర్ణప్యాలెస్ అగ్ని ప్రమాదానికి సంబంధించి ఫైల్ చేసిన ఎఫ్ఐఆర్‌పై స్టే విధించిన హైకోర్టు ధర్మాసనం.. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. డాక్టర్ రమేష్ కుమార్‌తో పాటు రమేష్ హాస్పిటల్ చైర్మన్‌పై తదుపరి చర్యలు తీసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

ఆ హోటల్లో ఏళ్ల తరబడి కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని పేర్కొంది. స్వర్ణ ప్యాలస్ హోటల్‌లో కోవిడ్ సెంటర్ నిర్వహణకు అధికారులే అనుమతి ఇచ్చారని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. దీంతో ఈ ప్రమాదానికి అనుమతులు మంజూరు చేసిన అధికారులు కూడా బాధ్యులేనని కోర్టు అభిప్రాయపడింది. వారు కూడా ఈ ప్రమాదానికి బాధ్యులే కదా అని ప్రశ్నించింది. దీంతో కేసు ఇంకా విచారణ దశలోనే ఉందని ప్రభుత్వ తరఫు న్యాయవాది అన్నారు.

కాగా, ఈ దుర్ఘటనకు రమేష్ ఆస్పత్రుల నిర్లక్ష్యమే కారణమని ప్రభుత్వ పెద్దలు ఆరోపిస్తున్నారు. ఈ కేసులో రమేష్ బాబును ఎట్టి పరిస్థితుల్లోనూ అరెస్టు చేస్తామని చెబుతున్నారు. ఈ తరుణంలోనే మంగళవారం స్వర్ణ ప్యాలెస్ దుర్ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం రూ. 50 లక్షల చెక్కులు పంపిణీ చేసింది. ఇది జరిగిన కొద్ది సేపటికే హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. దీంతో వైసీపీ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లంది.

Tags :
|
|
|

Advertisement