Advertisement

  • మూడు రాజధానుల అంశంపై సెప్టెంబర్ 21 వరకు స్టే పొడిగించిన హైకోర్ట్

మూడు రాజధానుల అంశంపై సెప్టెంబర్ 21 వరకు స్టే పొడిగించిన హైకోర్ట్

By: Sankar Thu, 27 Aug 2020 7:14 PM

మూడు రాజధానుల అంశంపై సెప్టెంబర్ 21 వరకు స్టే పొడిగించిన హైకోర్ట్


మూడు రాజధానులు, సీఆర్డీఏ వ్యవహారంపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. దీనిని వచ్చే నెల (సెప్టెంబర్) 21 వరకు హైకోర్టు పొడిగించింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 21కి వాయిదా వేసింది.

రాజధాని బిల్లులలు అమలు చేయకుండా స్టేటస్కో కొనసాగుతందని ధర్మాసనం తెలిపింది. కౌంటర్ దాఖలు చేసేందుకు ప్రభుత్వానికి సెప్టెంబర్ 11 వరకు సమయం ఇచ్చింది.. అలాగే అభ్యంతరాలు చెప్పేందుకు సెప్టెంబర్ 17 వరకు గడువు ఇచ్చారు. సెప్టెంబర్ 21 నుంచి రోజూ విచారణ జరుపుతామని తెలిపింది.

మూడు రాజధానుల అంశంపై ఏపీ బుధవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఏపీ హైకోర్టు ఇచ్చిన స్టేటస్‌ కో ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను ధర్మాసనం తోసిపుచ్చింది. హైకోర్టు విచారణ చేస్తున్నందున ఈ దశలో జోక్యం చేసుకోలేమంది. మూడు రాజధానుల అంశంపై గురువారం హైకోర్టులో విచారణ ఉందని.. తమ వద్దకు రావడం సరికాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈకేసును హైకోర్టు త్వరగా పరిష్కరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది. స్టేటస్ కోపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది.

Tags :
|

Advertisement