Advertisement

  • ఏపీ ప్రభుత్వ పథకాల్లో వైఎస్సార్ ఫోటోలను ఎందుకు పెట్టకూడదు...హైకోర్టు

ఏపీ ప్రభుత్వ పథకాల్లో వైఎస్సార్ ఫోటోలను ఎందుకు పెట్టకూడదు...హైకోర్టు

By: chandrasekar Tue, 01 Sept 2020 2:09 PM

ఏపీ ప్రభుత్వ పథకాల్లో వైఎస్సార్ ఫోటోలను ఎందుకు పెట్టకూడదు...హైకోర్టు


దివంగత ముఖ్యమం‍త్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఫోటో ఆంధ్రప్రదేశ్‌లో అమలవుతున్న ప్రభుత్వ పథకాలపై పెట్టడంపై సోమవారం హైకోర్టులో కీలక వాదనలు జరిగాయి. దివంగత వైఎస్సార్ ప్రస్తుత సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి తండ్రి అని, ఆయన గతంలో రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారని న్యాయస్థానం గుర్తు చేసింది. వైఎస్సార్ ఫోటోలను ఎందుకు పెట్టకూడదని, ఆయన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు కదా? అని కోర్టు వ్యాఖ్యానించింది. ప్రభుత్వ ప్రకటనల్లో వైఎస్సార్‌ ఫోటోను తొలగించాలని కోరుతూ ఓ వ్యక్తి ఇటీవల హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన ధర్మాసనం ఆయన ఈ వ్యాజ్యాన్ని తాము విచారించబోమని, రెగ్యులర్‌ బెంచ్‌ వెళ్లాలని పిటిషనర్‌కు సూచించింది.

ఈ పిటిషన్‌పై సోమవారం విచారణ సందర్భంగా అడ్వకేట్‌ జరనల్‌ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించారు. పిటిషన్‌ దాఖలు చేసిన వ్యక్తి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకు చెందిన వ్యక్తి అని, ఆయన టీడీపీ సానుభూతి పరుడని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. పిటిషనర్‌కు టీడీపీతో విడదీయరాని అనుబంధం ఉందని, టీడీపీతో రాజకీయ అనుబంధాన్ని ఇక్కడ తొక్కిపెడుతున్నారని అడ్వొకేట్ జనరల్ కోర్టు దృష్టికి తెచ్చారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రచురించిన ప్రభుత్వ ప్రకటలను అడ్వకేట్‌ హైకోర్టుకు నివేదించారు. ఎన్టీఆర్, చంద్రబాబు, లోకేష్, నారాయణలతో అప్పట్లో ప్రకటనలు ఇచ్చారని తెలిపారు. మంత్రులు, ఇతర వ్యక్తుల ఫొటోలు ప్రకటనల్లో పెట్టుకోవచ్చని దేశ అత్యున్నత న్యాయస్థానం గతంలోనే తీర్పునిచ్చినిందని గుర్తు చేశారు.

Tags :
|

Advertisement