Advertisement

ఆన్ లైన్ రమ్మీని నిషేదించిన ఏపీ సర్కార్

By: Sankar Thu, 03 Sept 2020 9:55 PM

ఆన్ లైన్ రమ్మీని నిషేదించిన ఏపీ సర్కార్


ఏపీలో పేకాటకు జగన్ సర్కార్ బ్రేకులు వేసింది.. దీనికి సంబంధించి కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రాష్ట్రంలో ఆన్ లైన్ జూదాన్ని నిషేధించింది.ఈ రోజు భేటీ అయిన ఏపీ కాబినెట్ ఈ కీలక నిర్ణయం తీసుకుంది

ఆన్ లైన్లో పేకాట రమ్మీ, పోకర్ లాంటి జూదాలను నిషేధించారు. కేబినెట్‌లో ఆన్ లైన్ జూదాలపై చర్చించారు. ఆన్ లైన్ జూదం, పేకాటలను నిషేధిస్తూ గేమింగ్ చట్టంలో సవరణల్ని ఆమోదించారు. ఆన్ లైన్లో ఎవరైతే రమ్మీ, పోకర్ లాంటి జూదాన్ని నిర్వహించే వారికి జరిమానా, శిక్ష విధిస్తారు. దీనికి సంబంధించి జీవో జారీ చేయాలని కేబినెట్ తీర్మానం చేసింది.

ఆన్ లైన్ రమ్మీ, పోకర్ నిర్వహించే వారు మొదటిసారి పట్టుబడితే వారికి ఏడాది పాటు జైలు శిక్ష, జరిమానా విధిస్తారు. ఒకవేళ రెండో సారి కూడా పట్టుబడితే వారికి రెండేళ్ల జైలు, జరిమానా విధిస్తారు. అలాగే, ఆన్ లైన్లో జూదం ఆడేవారికి కూడా ఆరు నెలల శిక్ష పడుతుంది. కొందరు డబ్బు కోసం ఆన్ లైన్ పేకాట నిర్వహిస్తూ యువతను తప్పుదారి పట్టిస్తున్నారని.. ఇటీవల చాలామంది ఇలాగే డబ్బు పోగొట్టుకుంటున్నారని కేబినెట్ భేటీలో చర్చ జరిగింది. దీంతో జూదాలపై నిషేధం విధించారు.

Tags :
|
|
|

Advertisement